గుమ్మడి కళా పీఠం ఆధ్వర్యంలో దర్శకేంద్రుడు దాసరి కి ఘన నివాళులు
న్యూస్ తెలుగు/వినుకొండ : దర్శకేంద్రుడు దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర స్టూడియోలో దర్శకేంద్రుడు, కళాకారులు దాసరి నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుమ్మడి మాట్లాడుతూ. దాసరి దర్శకత్వం వహించిన అనేక సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయని భగ్న ప్రేమికుడిగా, మేఘసందేశం చిత్రం మరియు సమాజాన్ని మేల్కొలిపే బొబ్బిలి పులి చిత్రం మరియు బిడ్డలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండే సూరిగాడు లాంటి సినిమాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి సందేశాత్మకమైనటువంటి చిత్రాలకు దర్శకత్వం వచ్చిన గొప్ప దర్శకుడు దాసరి అని వారి గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఏడుకొండలు, మందేపల్లి లక్ష్మీనరసయ్య , ముఖ్యాని వెంకటేశ్వర్లు, దాసరి నాగేశ్వరరావు, ముదికోటి మహేశ్వర రావు, రావిపాటి వీరయ్య, బొంకూరి అజయ్, తదితరులు పాల్గొన్నారు.(Story : గుమ్మడి కళా పీఠం ఆధ్వర్యంలో దర్శకేంద్రుడు దాసరి కి ఘన నివాళులు )

