Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌యస్ సి,యస్ టీ కమిషన్ చైర్మన్ గా చోళ్ళ

యస్ సి,యస్ టీ కమిషన్ చైర్మన్ గా చోళ్ళ

యస్ సి,యస్ టీ కమిషన్ చైర్మన్ గా చోళ్ళ

న్యూస్ తెలుగు/చింతూరు : చోళ్ళ బుజ్జి రెడ్డి తన ఉపాధ్యాయ వృత్తిని వదులుకొని ప్రజాసేవకు అంకితమైన గత 20 సంవత్సరాలుగా బిజెపి కార్యకర్తగా డివిజన్ నాయకుడిగా బిజెపి ఏ ఎస్ ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న నిస్వార్ధ నిరండబర నాయకుడైన చొల్ల బుజ్జి రెడ్డి ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమించడం పట్ల బిజెపి ఏ ఎస్ ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాయం వెంకయ్య, చింతూరు బిజెపి పార్టీ మండల అధ్యక్షులు డివిఎస్ రమణారెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు కట్టం ముత్తయ్య,మూట మల్లేష్, మీడియం ప్రసాద్, సోడి వీరయ్య, జారి బుజ్జమ్మ, శ్యామల జోగారావు మడివి కన్నయ్య హర్షం వ్యక్తం చేశారు ఈ నియామకం కోసం కృషిచేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురందరేశ్వరికి రాష్ట్ర బిజెపి సంఘటన మంత్రి మధుకర్ జి కి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు చింతూరు లో బిజెపి నాయకులు విలేకరుల సమావేశం అధ్యక్షుల స్వగృహం లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో వారు మాట్లాడుతూ బీజేపీలో కష్టపడి పనిచేసిన వారికి ముఖ్యంగా కొండారెడ్డి తెగకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ ఇవ్వటం బిజెపి పార్టీ గొప్పతనానికి నిదర్శన మన్నారు బిజెపి దేశంలో ఎస్టీలను ముఖ్యమంత్రులుగా దేశ అత్యున్నత పదవి అయినా రాష్ట్రపతి గా ఎస్ ఎస్ టి మహిళను నియమించటం బిజెపి గిరిజలను పట్ల ఉన్న శ్రద్ధ అభిమానానికి నిదర్శన మన్నారు.(Story : యస్ సి,యస్ టీ కమిషన్ చైర్మన్ గా చోళ్ళ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!