Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కుట్టుమిషన్ల శిక్షణ ద్వారా మహిళా ఆ‌ర్థిక ప్రగతికి బాటలు

కుట్టుమిషన్ల శిక్షణ ద్వారా మహిళా ఆ‌ర్థిక ప్రగతికి బాటలు

కుట్టుమిషన్ల శిక్షణ ద్వారా మహిళా ఆ‌ర్థిక ప్రగతికి బాటలు

వినుకొండలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభించిన జీవీ ఆంజనేయులు

న్యూస్‌తెలుగు/వినుకొండ : కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుట్టుమిషన్ల శిక్షణ ద్వారా మహిళా ఆర్థికప్రగతికి బాటలు పడతాయని ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అదే లక్ష్యంలో రూ.255 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా లక్షలమందికి మేలు జరగబోతుందన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46 వేల మందికి, ఆర్థికంగా వెనకబడిన ఇతర కులాల వారిలో 56 వేల 700 మందికి ప్రభుత్వం కుట్టుమిషన్ల శిక్షణ ప్రారంభిస్తోందని తెలిపారు. ఇందుకోసం రూ.255 కోట్లు నిధులు కేటాయించిందన్నారు. వినుకొండలోని గుర్రం జాషువా కళా ప్రాంగణంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని బుధవారం చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ వారి సహకారంతో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ. మహిళలు ఇంటివద్దనే ఉపాధి, ఆదాయం పొందేలా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందడానికి సువర్ణావకాశమని అభిప్రాయ పడ్డారు. వినుకొండలో బీసీ కార్పొరేషన్ ద్వారా 285మందికి మొదటి విడతలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 45 నుంచి 90 రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ పొందిన వారందరికీ ప్రభుత్వఖర్చుతోనే కుట్టుమిషన్లు కొనిస్తామని తెలిపారు. తద్వారా మహిళలు ఇంటివద్ద నుంచే నెలకు రూ.5వేల నుంచి రూ.15 వేల వరకు ఆదాయంతో కుటుంబ పోషణలో పాలుపంచుకునే అవకాశం లభిస్తుందనిస పిల్లల్ని మంచి చదువులు చదివించుకోగలుగుతారని తెలిపారు. శిక్షణ పొందినవారు ఆధునిక మోడళ్లను చేయగలిగితే స్థానికంగా మంచి మార్కెట్ కూడా ఏర్పాటవుతుందన్నారు. మహిళా సాధికారిత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఆలోచించి తీసుకుని వచ్చిన ఈ కార్యక్ర మాన్ని మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలియజేస్తున్నామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇలా అన్ని కార్పొరేషన్ల ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాలు, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి రుణాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ ఛైర్మన్. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ ఛైర్మన్ దస్తగిరి, కమిషనర్ సుభాష్ చంద్రబోస్, పి. అయూబ్ ఖాన్, కె. నాగ శ్రీను, పి. వి. సురేష్ బాబు, పత్తి పూర్ణ, కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, షేక్ జానీ, తదితరులు పాల్గొన్నారు.(Story:కుట్టుమిషన్ల శిక్షణ ద్వారా మహిళా ఆ‌ర్థిక ప్రగతికి బాటలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!