Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అలా జ‌రిగింది..ఆయుధ డంప్ క‌థ క్లోజ్‌!

అలా జ‌రిగింది..ఆయుధ డంప్ క‌థ క్లోజ్‌!

అలా జ‌రిగింది..ఆయుధ డంప్ క‌థ క్లోజ్‌!

* భారీ పేలుడు సామాగ్రి స్వాధీనం
* ఆరుగురిపై కేసు నమోదు
* పేలుడు సామాగ్రి విలువ‌ రూ.20 లక్షలు
* మీడియాతో డీఎస్పీ రామాంజనేయులు

న్యూస్‌తెలుగు/బాప‌ట్ల‌: బాప‌ట్ల‌లో భారీగా బ‌య‌ట‌ప‌డిన ఆయుధ డంప్ క‌థ ముగిసింది. లైసెన్స్‌లు లేని ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. బాపట్ల జిల్లాలోని మార్టూరు మండలం నాగరాజుపల్లి గ్రామ పొలాల్లో నాగ వేణుగోపాల్‌కు చెందిన పేలుడు పదార్ధాలు నిల్వ ఉంచే మ్యాగ్జిన్‌లో అనుమతులు లేకుండా అక్రమంగా నిలువ ఉంచిన రూ. 20 లక్షలు విలువ గల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. నిందితులే దాసం హనుమంతురావు, దాసం వీరాజంనేయులు, నాగండ్ల ప్రసన్న, బత్తుల సాంబశివరావు, ప్రతాప్‌రెడ్డి అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను డీఎస్పీ మార్టూరు పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన అక్రమంగా పేలుడు సామాగ్రి నిల్వ ఉంచారని సమాచారం మేరకు జిల్లా ఎస్పీ తుషార్‌డూడి ఆదేశాలలో మార్టూరు సీఐ శేషగిరిరావు సిబ్బందితో కలిసి నాగరాజుపల్లి గ్రామ పరిధిలో ఉన్న మిడాల నాగవేణుగోపాల్‌కు చెందిన గోడౌన్‌ వద్దకు చేరుకున్నారన్నారు. అక్కడ ఉన్న దాసం హనుమంతురావును అదుపులోకి తీసుకొని విచారించగా గోడౌన్‌ లైసెన్సుదారుడిగా మిడాల నాగవేణుగోపాల్‌కు మార్చి 31వ తేదీ వరకు మాత్రమే లైసెన్స్‌ అనుమతి ఉందని తెలిపారు.

మిడాల నాగ వేణుగోపాల్‌ వద్ద నుండి దాసం హనుమంతురావు సబ్‌ లీజుకి తీసుకొని సుమారు కొన్ని సంవత్సరాలు నుండి వ్యాపారం చేస్తూ గ్రానైటు క్వారీలలో ముడిరాళ్ళు పగలకొట్టడానికి ఉపయోగించే మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్ధాలు జెలిటెన్‌ స్టిక్స్‌, ఎలక్ట్రికల్‌ డిటోనేటర్‌, ఆర్డినరీ డిటోనేటర్‌, డిటోనేటర్‌ ఫ్యూజ్‌ వైర్స్‌ వంటి సామగ్రిని విక్రయిస్తాడని తెలిపారు. తెలంగాణా మేడ్చల్‌ జిల్లాలోని కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న సాల్వో ఇండస్ట్రీస్ ప్రైవేట్‌ కంపెనీ నుండి కొనుగోలు చేసి వాటిని రవాణా చేయుటకు లైసెన్సు అశోక్‌ లేలాండ్‌, బొలెరో స్వంత వాహనాలు ద్వారా నాగండ్ల ప్రసన్న సహాయంతో తీసుకొని వచ్చి గోడౌన్‌లో అక్రమంగా నిల్వ పెట్టి వాటిని లైసెన్సు ఉన్న క్వారీ, క్రషర్‌ లైసెన్సు లేని గ్రానైటు క్వారీ, క్వారీ క్రషర్‌ వారికి అధిక ధరకు అమ్ముకొని లాభాలు గడిస్తుంటాడన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 18న ఏ విధమైన బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన 5 టన్నుల బరువు గల 180 బాక్స్‌లు థండర్ బోల్ట్‌ జెలిటిన్‌ ప్రేలుడు పదార్ధాలను 20 బాక్స్‌లో ఈ-90 పేలుడు పదార్ధాలను లారీలో నాగండ్ల ప్రసన్న ద్వారా లోడ్‌ చేసుకొని వస్తూ, మార్గమధ్యలో దాసం హనుమంతురావు, దాసం వీరాంజినేయులు, మిడాల నాగ వేణుగోపాల్‌లు బత్తుల సాంబశివరావుకు అతని ద్వారా ప్రతాప్‌ రెడ్డికి ఎలాంటి బిల్లులు లేకుండా అధిక ధరలకు విక్రయించారన్నారు. వీరు గతంలో కొందరితో కలిసి కుట్ర పూరితంగా ఎలాంటి బిల్లులు లేని ప్రేలుడు పదార్ధాలను వినుకొండ, గుంటూరులోని పేరేచర్ల క్రషర్‌ ఓనర్‌లకు అమ్మినట్లు తెలిసిందన్నారు.

ప్రేలుడు పదార్ధాలు అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడే వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడం వలన వాటిని ఉపయోగించి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలుగజేయుటకు అవకాశం ఉంటుందన్నారు. సరైన బిల్లులు లేకుండా అమ్ముతూ నాగరాజుపల్లి గ్రామ పరిధిలో పేలుడు పదార్ధాలు కలిగిన స్టాక్‌ మ్యాగ్జిన్‌ స్టాక్‌ వివరాలు వ్యత్యాసం కలిగి ఉన్నందున ముద్దాయి దాసం హనుమంతురావును శనివారం రాత్రి అదుపులోకి తీసుకుని పేలుడు సామాగ్రిని వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా పేలుడు సమాగ్రి ఉంచితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు. (Story: అలా జ‌రిగింది..ఆయుధ డంప్ క‌థ క్లోజ్‌!)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!