సాఫ్ట్ బాల్ పోటీల్లో జి. పవన్ కి బంగారు పతాకం
న్యూస్ తెలుగు / వినుకొండ : ధనలక్ష్మి కాలేజి ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలో ఎం.పి.ఈడి 2 వ సంవత్సరం -చదువుతున్న విద్యార్థి జి. పవన్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు ఆర్.వి.ఆర్ జెసి ఇంజనేరింగ్ కళాశాలలో చౌడవరం లో మార్చి 18 నుంచి 20 తారీకు వరకు టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ టర్నమెంట్ లో నాగార్జున యూని వర్సిటీ క్రింద ఉన్న అన్ని, డిగ్రి, పీజీ, కళాశాలలు పాల్గొన్నారు. ఇందులో ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారు ఈ టోర్నమెంట్ లో బంగారు పతకం సాధించారు. ఈ కాలేజి టీం నుండి వినుకొండ కు చెందిన విద్యార్థి ” జి. పవన్” ఈ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించి బంగారు పతకాన్ని సాధించారు.