క్షేత్ర స్థాయిలో జనసేనని బలోపేతం చేయాలి
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి , ఎంఎస్ఎంఈ అభివృద్ది సంస్థ్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్
న్యూస్తెలుగు/విజయనగరం :క్షేత్ర స్థాయిలోజమసేన పార్టీని బలోపేతం చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి , ఎంఎస్ఎంఈ అభివృద్ది సంస్థ్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ అన్నారు. విజయనగరం నియోజకవర్గంలో గుంకలాం గ్రామం,విజయనగరం 26 డివిజన్ నుండి పలువురు జనసేన నేత గురాన అయ్యలు ఆధ్వర్యంలో మంగళవారం వైకాపా నుండి జనసేన పార్టీలో చేరారు. వీరికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి , ఎంఎస్ఎంఈ అభివృద్ది సంస్థ్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ విశాఖపట్నంలో తన కార్యాలయంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన రాజకీయ ప్రస్థానం.. పదవుల కోసం కాదు ప్రజాసేవ కోసం అన్నారు.
జన సైనికులకు భద్రత, భరోసా జనసేన లక్ష్యమన్నారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ నిజాయతీ, శ్రమ, చిత్తశుద్ధి అనేవి రాష్ట్ర ప్రజలకు పాలనాపరంగా ఎంతమేర ఉపయోగపడతున్నాయి అనేది ప్రతి జనసైనికుడు, వీర మహిళా ప్రజలకు తెలియజెప్పాలన్నారు. నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని రాష్ట్రానికి ఎంత మేర ఉపయోగపడతున్నారు అనేది అర్ధం అయ్యేలా ప్రజలకు వివరించాలన్నారు. కల్మషం లేకుండా పార్టీ కోసం పనిచేస్తూ, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకున్న జనసైనికులంతా బలంగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
విజయనగరం జిల్లా జనసేన నేత గురాన అయ్యలు మాట్లాడుతూ
క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుండి రాష్ట్రస్థాయి నాయకుల వరకూ అందరితో మమేకమై పార్టీ ని బలోపేతం చేయడానికి సమిష్టిగా పని చేస్తామన్నారు.
పార్టీకి, ప్రజా ప్రయోజనాలకు సంభందించిన ఏ అంశాలైనా చర్చించడానికి జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. ప్రజా ప్రయోజనాల పట్ల నిబద్ధత, నిజాయితీ, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో చాలా అరుదన్నారు.ఆయన నాయకత్వంలో పనిచేయడం అదృష్టమన్నారు.
ఈ కార్యక్రమంలో భోగి సాయి కుమార్ నేతృత్వంలో గుంకలాం గ్రామానికి చెందిన లంక అప్పలనాయుడు,గండ్రేటి సురేష్,ఆల్తి శ్రీను,ఇల్లాపు రామకృష్ణ,కె రామకృష్ణ,లంక రమణ,
సిడగం నారం నాయుడు,గంర్రెడ్డి రాంబాబు,ఎ. శ్రీను,గొర్లి రాము, డి మోహన్, రౌతు హరి,కోరాడ మణి,కె.కోటి,భోగి రమణ,జి .అప్పలరాజు, సాయి,లెంక శ్రీనులు పార్టీలో చేరారు.అలాగే విజయనగరం పట్టణంలో 26వ డివిజన్ కి చెందిన కోలా సతీష్ ,కోలా రాజేష్ జనసేన పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి పలువురు జనసేన నేతలు పాల్గొన్నా (Story : క్షేత్ర స్థాయిలో జనసేనని బలోపేతం చేయాలి)