Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ చేనేత సభకు వందలాదిగా తరలిరండి

చేనేత సభకు వందలాదిగా తరలిరండి

0

చేనేత సభకు వందలాదిగా తరలిరండి

ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నామాల శంకరయ్య

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని మారుతీ రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపంలో ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటలకు నిర్వహించబోయే చేనేత సభకు వందలాదిగా తరలిరావాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నామాల శంకరయ్య, పట్టణ అధ్యక్షులు బండి వెంకటేశులు, ఉపాధ్యక్షులు జి రవి, ప్రధాన కార్యదర్శి కే. జంగమన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని, చేనేత సభకు సంఘీభావం తెలపడం జరిగిందని వారు తెలిపారు. ఈ చేనేత సభలో మన సమస్యల పరిష్కారానికి ఒక మంచి అవకాశం వచ్చిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి బెల్లం తిరుపాలు, కోశాధికారి కొండయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : చేనేత సభకు వందలాదిగా తరలిరండి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version