UA-35385725-1 UA-35385725-1

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తి కావాలి : సిపిఐ

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తి కావాలి : సిపిఐ

న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణలో ప్రజా పోరాటాలకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్ పిలుపునిచ్చారు. గోపాలపేట మండలం ఏదుట్ల లో ఆదివారం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలును నిర్వహించారు. నాటి పోరుకు నాయకత్వం వహించిన కామ్రేడ్ రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొహినుద్దీన్, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలో వేసి నివాళులర్పించారు. కామ్రేడ్ కోటయ్య అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడారు. భూమి, భుక్తి, వెట్టి నుంచి తెలంగాణ ప్రజల విముక్తి కోసం సిపిఐ జరిపిన పోరాటం ద్వారానే తెలంగాణ భారతదేశం లో విలీనమైందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల నే తెలంగాణ భారత్ లో కలిసిందని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించే కుట్ర చేస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టులు నిజాం మద్దతు దారులైన దొరలు భూస్వాములు జమీందారులు జాగీరుదారులను తరిమికొట్టి 3000 గ్రామాలను విముక్తం చేసి, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని, 4500 మంది పోరాటంలో అమరులయ్యారన్నారు. అదే పోరాట స్ఫూర్తితో ప్రజల హక్కుల కోసం, అభివృద్ధి సంక్షేమం కోసం పాలక ప్రభుత్వాలపై పోరాటం సాగించాలన్నారు. సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి జె. రమేష్, ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎత్తం మహేష్, లక్ష్మీనారాయణ, విష్ణు, స్థానిక నాయకులు వెంకటస్వామి ఆచారి, దక్షిణామూర్తి, మేకల శ్రీను, పెద్ద నరసింహ, పిడతల బాలయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తి కావాలి : సిపిఐ)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1