Home వార్తలు ఐటీఐల పునఃరూపకల్పనలో టెక్నాలజీ, ఏఐ

ఐటీఐల పునఃరూపకల్పనలో టెక్నాలజీ, ఏఐ

0

ఐటీఐల పునఃరూపకల్పనలో టెక్నాలజీ, ఏఐ

న్యూస్‌తెలుగు/అమరావతి: నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ భారతదేశ వృత్తిపరమైన శిక్షణా రంగాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి కార్యక్రమాలను ప్రారంభించడం గర్వంగా ఉందనీ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ లో భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు) జయంత్‌ మాట్లాడుతూ అన్ని ఐటీఐలు, ఎన్‌ఎస్‌టిఐలలో మైక్రోసాఫ్ట్‌ ఏఐ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ ప్రోగ్రామ్‌ 10,000 కంటే ఎక్కువ మంది అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుందన్నారు. దాదాపు 15 ఎన్‌ఎస్టిఐలలో ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌’ కోర్సును ప్రవేశపెట్టడానికి మద్దతు ఇవ్వడం ప్రధాన అంశమన్నారు. ఈ శిక్షణ మన దేశంలోని ప్రతి మూలకు చేరుతుందని నిర్ధారించుకోవడానికి, మైక్రోసాఫ్ట్‌ 2024 అకడమిక్‌ సెషన్‌తో ప్రారంభమయ్యే 15 నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో క్రాఫ్ట్స్‌మెన్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌ కింద ఏఐ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌’ కోర్సు రోల్‌ అవుట్‌కు మద్దతు ఇస్తుందన్నారు. (Story : ఐటీఐల పునఃరూపకల్పనలో టెక్నాలజీ, ఏఐ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version