Homeవార్తలుజెఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు పియర్సన్‌ ప్రిపరేషన్‌ సిరీస్‌ విడుదల

జెఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు పియర్సన్‌ ప్రిపరేషన్‌ సిరీస్‌ విడుదల

జెఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు పియర్సన్‌ ప్రిపరేషన్‌ సిరీస్‌ విడుదల

న్యూస్‌తెలుగు/కోట: ప్రపంచపు జీవితకాల అభ్యాస సంస్థ, పియర్సన్‌, తమ కొత్త జెఈఈ అడ్వాన్స్‌డ్‌ పిసిఎం (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) సిరీస్‌ను విడుదల చేసింది, ఇది పోటీతత్వ జెఈఈ మెయిన్‌, జెఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం అత్యంత జాగ్రత్తగా రూపొందించిన వనరు. ప్రతి సంవత్సరం, 12 లక్షల మంది జెఈఈ మెయిన్స్‌, 2.5 లక్షల మంది అభ్యర్థులు జెఈఈ అడ్వాన్స్‌డ్‌లను ప్రయత్నిస్తారని అంచనా. ఈ సమగ్ర పుస్తక శ్రేణితో, 11వ, 12వ, 13వ తరగతులు (రిపీటర్‌)కు చెందిన విద్యార్థులు, ఈ పోటీ పరీక్షలలో ప్రయత్నించి విజయం సాధించాలని కోరుకుంటున్న ఔత్సాహికులకు సహాయం చేయాలని పియర్సన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. రాజస్థాన్‌లోని కోటలో జరిగిన అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యా రంగంలోని ప్రముఖులు, పియర్సన్‌ జెఈఈ అడ్వాన్స్‌డ్‌ పిసిఎం సిరీస్‌ రచయితలు ఓం శర్మ, అనన్య గంగూలీ, రాహుల్‌ సర్దానా పాల్గొన్నారు. పియర్సన్‌ ఇండియా కంట్రీ హెడ్‌ వినయ్‌ స్వామి మాట్లాడుతూ, కొత్త జెఈఈ పిసిఎం అడ్వాన్స్‌డ్‌ సిరీస్‌ను కోటాకు చెందిన అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకులు రూపొందించారని, ఇది ఔత్సాహికులకు సమగ్రమైన ప్రిపరేషన్‌ మార్గాలను అందిస్తుందని అన్నారు. (Story : జెఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు పియర్సన్‌ ప్రిపరేషన్‌ సిరీస్‌ విడుదల)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!