నిలువుకాళ్ళపై నిలబడ్డ దళిత ఎంపీపీ
స్వతంత్ర దేశంలో దళిత మహిళా ప్రతినిధికి అవమానం
చాట్రాయి (న్యూస్ తెలుగు) : 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో … అధికార వైయస్సార్ పార్టీకి చెందిన దళిత మహిళా ప్రజా ప్రతినిధి…. చాట్రాయి మండల పరిషత్ అధ్యక్షురాలు… లంకా నిర్మల నిలువు కాళ్ళపై నిలబడ్డ దృశ్యమది . వైయస్సార్ పార్టీకి కంచుకోట… బూరుగగూడెం గ్రామంలో…ఏపీ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ దేశి రెడ్డి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో గడచిన నాలుగు రోజులుగా చాట్రాయి మండలం బూరుగగూడెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ తరపున ఎంపిపి సొంత గ్రామమైన బూరుగగూడెం గ్రామంలో సాధారణ పౌరులు వైసిపి కార్యకర్తలు దేశి రెడ్డి సమక్షంలో కుర్చీలలో కూర్చుంటే ఎంపీపీ లంక నిర్మల మాత్రం జరుగుతున్న సభను చూడటానికి వినడానికి ఒక సాధారణ మహిళ వచ్చినట్లు వచ్చి నిలువు కాళ్ళపై నిల్చోవడం తన వంతు అయింది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ వంటి రాజ్యాంగ నిర్మాతలు రాసిన రాజ్యాంగం ప్రకారం తప్పనిసరి పరిస్థితుల్లో లెక్కల కోసం దళితులు, దళిత మహిళలు, బలహీనవర్గాలు గిరిజనులు, గిరిజన మహిళలను “పొయ్యి కాడ మసిగుడ్డ” మాదిరిగా వాడుతూ అగ్రవర్ణాలు, పెత్తందారులు కుల వివక్షతను కొనసాగిస్తున్నారనడానికి ఇదొక సాక్ష్యం. ఈ ఉదంతం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో పెత్తందారీ విధానం శృతిమించిపోయి పెద్ద పెద్ద నాయకులు దళితులు, బలహీన వర్గాలకు ప్రజాప్రతినిధులకు కనీసమైన గౌరవం ఇవ్వడం లేదు అనడానికి ఈ ఘటన అద్దం పడుతుందని పలువురు అంటున్నారు. (Story: నిలువుకాళ్ళపై నిలబడ్డ దళిత ఎంపీపీ)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్గా కే.శ్రీనివాస్రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్హుడ్లో నితిన్ వేరే లెవల్!