ఫోర్ట్ సిటీ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు
విజయనగరం (న్యూస్ తెలుగు) : విజయనగరంలో రింగ్ రోడ్డు వద్ద ఉన్న పోర్ట్ సిటీ పాఠశాలలో శనివారం 12వ వార్షికోత్సవ వేడుకలను పాఠశాల చైర్మన్ కె ఏ పి రాజు( శివ) ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ముందుగా విద్యార్థులు వివిధ రకాల నృత్యాలు, నాటికలు, యోగ, పిరమిడ్స్, కోలాటం, తదితర అంశాల్లో తమ ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల చైర్మన్ కె ఏ పి రాజు శివ మాట్లాడుతూ ప్రస్తుత విద్యార్థుల ప్రదర్శనలు చూస్తుంటే ప్రపంచమంతా ఒకేసారి తిరిగి వచ్చినట్లు ఉందన్నారు. పాఠశాలలో విద్యతోపాటు ఇటువంటి కార్యక్రమాలను ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ఈ విద్యా సంవత్సరంలో టాపర్స్, శతశాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ చైర్మన్ చంటి, ప్రిన్సిపాల్ రోయినా ఖాన్, డైరెక్టర్లు మధు, అశోక్, నీలిమ తదితరులు పాల్గొన్నారు. (Story: ఫోర్ట్ సిటీ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు)
See Also:
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్హుడ్లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2