UA-35385725-1 UA-35385725-1

ప్రజల పక్షాన పత్రికలు ఉండాలి

విశాల తెలంగాణ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

నాగర్ కర్నూల్: పత్రికలు ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వం చేసే తప్పులను ప్రజలకు చేరవేసే విధంగా పత్రికలు పనిచేయాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ లోని ఆయన నివాసంలో విశాల తెలంగాణ తెలుగు దినపత్రిక నూతన 2024 క్యాలెండర్ ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికలు ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వం చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే విధంగా ఉండాలన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం చేసే తప్పులను ప్రజలకు తెలియజేయాలన్నారు. అంతకుముందు విశాల తెలంగాణ దినపత్రిక ఎడిటర్ కొండకింది మాధవరెడ్డి ఎమ్మెల్యేకు శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు కందికొండ మోహన్, ముచ్చర్ల దినకర్, ఆయా పత్రికల జర్నలిస్టులు బైరెడ్డి వెంకటరెడ్డి, సాదిక్ శ్రీశైలం, బొగ్గు బంగారయ్య, కాంగ్రెస్ కౌన్సిలర్లు జక్కా రాజకుమార్ రెడ్డి, కొత్త శ్రీనివాసులుతోపాటు తదితరులు పాల్గొన్నారు. (Story: ప్రజల పక్షాన పత్రికలు ఉండాలి)

See Also:

బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? హిందూ వ‌నిత‌కు నుదుట తిల‌కం త‌ప్ప‌దా?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1