రూ.12,999 ధరలో ఒప్పో కే12ఎక్స్ 5జీ విడుదల
న్యూస్తెలుగు/ముంబయి: ఒప్పో ఇండియా తన ఉత్పత్తుల శ్రేణిలో అత్యంత కఠినమైన 5జీ స్మార్ట్ఫోన్ కే12ఎక్స్ 5జీని కేవలం రూ.12,999కి పరిచయం చేస్తోంది. ఈ పరికరం బ్రీజ్ బ్లూ, మిడ్నైట్ వైలెట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో, ఒప్పో ఇ-స్టోర్, ఫ్లిప్కార్ట్లో 2 ఆగస్టు 2024 నుంచి అందుబాటులో ఉంటుంది. ఇది ‘ఎంఐఎల్ ఎస్టీడీ-810హెచ్’ మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్, దుమ్ము, నీటి నిరోధకత కోసం ఐపీ54 రేటింగ్ను, సెగ్మెంట్-ఫస్ట్ స్ల్పాష్ టచ్ టెక్నాలజీతో సెగ్మెంట్-లీడిరగ్ మన్నికను కలిగి ఉంటుంది. కనుక, వినియోగదారులు తడి వేళ్లతోనూ టచ్స్క్రీన్ను ఆపరేట్ చేయవచ్చు. అలాగే ఒప్పో తన కే12ఎక్స్ 5జీ ఇప్పుడు 360డిగ్రీల డ్యామేజ్ ప్రూఫ్ ఆర్మర్ బాడీతో రూ.15కే విభాగంలో కొత్త ప్రమాణాన్ని సెట్ చేస్తోంది. దీనిలో రెండు రెట్లు పటిష్టమైన పాండా గ్లాస్ డిస్ప్లే, దాని హై-స్ట్రెంత్ అల్లాయ్ ఫ్రేమ్ను ఒప్పో అభివృద్ధి చేసి- పరికరానికి దృఢత్వాన్ని జోడిస్తుంది.