పెన్షన్ల పంపిణీలో కార్యకర్తలందరూ పాల్గొనాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : బుధవారం జరగనున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జులు, మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులతో పాటు ప్రతి కార్యకర్త తప్పనిసరిగా పాల్గొనాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.లబ్ధిదారులకు సకాలంలో పెన్షన్లు అందేలా చూడాలని, దీనిని ఒక సేవా కార్యక్రమంగా భావించి నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని ఆయన సూచించారు. పెన్షన్ పంపిణీ చేస్తున్నప్పటి ఫోటోలను తప్పనిసరిగా “మై టీడీపీ” యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అందరూ సమన్వయంతో వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.(Story : పెన్షన్ల పంపిణీలో కార్యకర్తలందరూ పాల్గొనాలి )

