సైబర్ నేరాలు పట్ల అవగాహన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి
చింతూరు సిఐ సిహెచ్ గోపాలకృష్ణ,ఎస్ఐపి రమేష్
న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ హై స్కూలు నందు విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో సెల్ఫోను ఉపయోగించే సమయంలో గుర్తుతెలియని ఫోన్ కాల్స్, మెసేజెస్ రిసీవ్ చేసుకునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది. తెలియని వ్యక్తులకు ఓటిపి చెప్పరాదు. డిజిటల్ అరెస్టులు అనేది బూటకమని, అవసరంలేని లింకులను ఓపెన్ చేయరాదని, ఫోన్ పే,గూగుల్ పే పంటి యాపులకు నిరంతరం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. విద్యార్థులకు మహిళలపై జరిగే నేరాలు, చైల్డ్ మ్యారేజెస్ నిర్మూలన, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, రోడ్డు భద్రతా నియమాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్కూలు బోధన,బోధ నేతర సిబ్బంది పాల్గొన్నారు.(Story :సైబర్ నేరాలు పట్ల అవగాహన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి )

