Homeవార్తలుతెలంగాణవనపర్తి జిల్లాలోని 5 మండలాల్లో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి

వనపర్తి జిల్లాలోని 5 మండలాల్లో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి

వనపర్తి జిల్లాలోని 5 మండలాల్లో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి

న్యూస్ తెలుగు/వనపర్తి : 
వనపర్తి జిల్లాలో రెండవ విడత పోలింగ్ జరిగిన వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత, మదనపూర్ మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుండి ప్రారంభమయి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ తీరును కలెక్టరేట్లోని సమావేశం మందిరం నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, సాధారణ ఎన్నికల పరిశీలకులు మల్లయ్య భట్టు, వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ తో కలిసి పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ నుండి మాత్రమే కాకుండా వనపర్తి మండలం, నాచహళ్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రం, పెద్దగూడెం గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ జరుగుచున్న ప్రక్రియను పరిశీలించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ భద్రతలు కట్టుదిట్టం చేశారు. నాచహళ్లి గ్రామంలో మీడియాతో మాట్లాడిన కలెక్టర్ ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని తెలియజేశారు. మధ్యాహ్నం 1.00 గంట వరకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి క్యూ లైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. పోలీస్ శాఖ ద్వారా కట్టుదిట్టమైన శాంతిభద్రతలు అమలు చేసినట్టు తెలిపారు. రెండో విడతలో పోలింగ్ జరిగిన వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూరు, అమరచింత మండలాల్లో మొత్తం కలిపి 1,03,406 ఓట్లు పోల్ కాగా, 87. 0% వోటింగ్ పర్సంటేజీ నమోదయింది. అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.(Story :వనపర్తి జిల్లాలోని 5 మండలాల్లో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments