ప్రముఖ చిత్రకారులు డా.వజ్రగిరి జెస్టిస్ కు ఓకేరోజు రెండు పురస్కారాలు
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ భవన్ లో ఈ నెల 3వ తారీకు న జరిగిన మన సంస్కృతి చిత్రకళా ప్రదర్శన మరియు స్మృతి పురస్కారాలలో భాగంగా జెస్టిస్ ఖండవల్లి శేషగిరిరావు స్మృతి పురస్కారం అందుకున్నారు. తాను గీసిన ” నాట్యమయూరి ” చిత్రానికి ప్రత్యేక పురస్కారాన్ని మాజీ మంత్రి వర్యులు శ్రీయుత మండలి బుద్ధప్రసాద్, ఆర్ట్ గిల్డ్ అధ్యక్షులు శ్రీ బి.ఎ.రెడ్డి, రాష్ట్ర సంస్కృత, తెలుగు అకాడమీ అధ్యక్షులు శరశ్చంద్ర , రాష్ట్ర క్రియేటివిటీ ఆర్ట్ అకాడమీ అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని, సుభాష్ బాబు, డ్రీమ్ రమేష్ తదితరుల చేతుల మీదుగా అందుకున్నారు. కళాకారునిగా వినుకొండ కు ఎంతో ఖ్యాతిని తీసుకుని వస్తున్న వజ్రగిరి జెస్టిస్ ను వినుకొండ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, కవులు రచయితలు, కళాకారులు, టీచర్స్, పాస్టర్స్, వివిధ కళా సంఘాల నాయకులు అభినందించారు. మరెన్నో అవార్డులు అందుకోవాలని అభిలాష వ్యక్తం చేశారు.(Story : ప్రముఖ చిత్రకారులు డా.వజ్రగిరి జెస్టిస్ కు ఓకేరోజు రెండు పురస్కారాలు )

