నూతన కమిషనర్ గా డి టి వి కృష్ణారావు నియామకం
న్యూస్ తెలుగు/సాలూరు:సాలూరు నూతన కమిషనర్ గా డి టి వి కృష్ణారావు శుక్రవారం కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్చార్జ్ కమిషనర్ గా వరప్రసాద్ విధులు నిర్వహించారు. కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏలూరు డెవలప్మెంట్ అథారిటీలో విధులు నిర్వహించేవారు. కమిషనర్ గా వచ్చిన ఆయన స్థానిక మంత్రి ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి ని మర్యాదపూర్వకంగా కలిశారు. సాలూరు పట్టణంలో మే నెలలో వచ్చే శ్యామలాంబ పండుగను జరుపుకుంటారు ఈ పండుగ లో ఏ విధంగా త్రాగునీరు, పారిశుధ్యం పనులు మెరుగుపరిస్తారో చూడాలని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. (Story: నూతన కమిషనర్ గా డి టి వి కృష్ణారావు నియామకం)

