జనసేన ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు పటానికి పూలమాలవేసి ఆయన స్మృతికి నివాళులు అర్పించిన వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగ శ్రీను రాయల్ మాట్లాడుతూ. తెలుగువారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మత్యాగం తెలుగువారి దృఢసంకల్పానికి నిదర్శనం. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. (Story :జనసేన ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు)

