మృతురాలు వట్టం సమ్మక్కకు నివాళులర్పించిన మంత్రి సీతక్క
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో : కొత్తగూడ మండల కేంద్రం గోపాలపురంలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ వారి మాతృమూర్తి వట్టం సమ్మక్క ఇటీవల అనారోగ్యంతో మరణించగా , సమ్మక్క దశదినకర్మ కు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, నీటిసరఫరా,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దన సరి అనసూయ సీతక్క హాజరై, వారి చిత్ర పటం వద్ద నివాళులర్పించి ,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడ మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు యువజన సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు (Story : మృతురాలు వట్టం సమ్మక్కకు నివాళులర్పించిన మంత్రి సీతక్క)