Homeవార్తలుతెలంగాణలేబర్ కోడ్ లపై ప్రతీఘటిస్తున్న కార్మిక వర్గం.. మొండి వైఖరితో అమలు చేస్తున్న కేంద్ర బిజెపి...

లేబర్ కోడ్ లపై ప్రతీఘటిస్తున్న కార్మిక వర్గం.. మొండి వైఖరితో అమలు చేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం

లేబర్ కోడ్ లపై ప్రతీఘటిస్తున్న కార్మిక వర్గం.. మొండి వైఖరితో అమలు చేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం

న్యూస్ తెలుగు/వనపర్తి :కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోర్లను తక్షణమే రద్దు చేయాలని CITU. AITUC. TUCI.కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వనపర్తి లోని తోపుడు బండ్ల కార్మికులతో కలసి నిరసన తెలిపారు.. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి.మoడ్ల రాజు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోష. టియుసిఐ జిల్లా సహాయ కార్యదర్శి గణేష్ లు మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి పెట్టుబడుదారులకు బడా కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్ లను కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిందని. ఈ నాలుగు లేబర్ కోడ్ లు కార్మికుల మెడలకు ఉరి తాడులు గా వేలాడుతున్నాయని. కార్మికుల హక్కులను మొత్తం కాలరాస్తున్నాయని మండిపడ్డారు.. సంగం పెట్టే హక్కును. ఏడు మంది నుంచి 100 మంది పొడగించారని. ఉద్యోగ భద్రత గాలికి వదిలేశారని. పీఎఫ్ ఈఎస్ఐ. కనీస వేతనాలు. లాంటి సౌకర్యాలను యజమానులకు అనుకూలంగా మార్చారని.వారు విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా ప్రైవేటు పరం చేసేందుకు ఈ నాలుగు లేబర్ కోట్లు ఉపయోగపడే విధంగా ఉన్నాయని. వాటిని ఆసరా చేసుకుని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారన్నారు. ప్రధాని మోడీ ఏకపక్ష నిర్ణయాలతో కార్మిక వర్గం అనేక సమస్యలు.సవాళ్ళతో కొట్టుమిట్టాడుతుందన్నారు. అందుకే కార్మిక వర్గం ప్రతిఘటిస్తూ మోడీ ప్రభుత్వం పై సమర శంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారని. సమ్మెల ద్వారా కార్మిక వర్గం ఇప్పటికే కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించిన మోడీ ప్రభుత్వం మాత్రం సమ్మె లను పెడ చెవిన పెడుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేసి విద్యుత్ సవరణ బిల్లు 2022ను తక్షణమే ఉపసంహరించుకోవాలని. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని కార్మికులకు ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి.18 వ వార్డు కౌన్సిలర్ గంధం మదన్. జిల్లా కమిటీ సభ్యులు నందిమల్ల రాములు నాయకులు మoడ్ల బాలస్వామి. తోపుడుబండ్ల కార్మిక సంఘం యూనియన్ అధ్యక్షులు నాగశేషి. ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ.ఏఐటీయూసీ జిల్లా నాయకులు రమేష్ వంశీ తోపుడుబండ్ల కార్మికులు సాయిలు.నాగన్న. తదితరులు పాల్గొన్నారు.(Story : లేబర్ కోడ్ లపై ప్రతీఘటిస్తున్న కార్మిక వర్గం.. మొండి వైఖరితో అమలు చేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!