మనం చేసిన అభివృద్ధియే మనకు శ్రీరామ రక్షా
న్యూస్ తెలుగు/వనపర్తి : మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , మాజీ ఎంపీ రావుల.చంద్రశేఖర్ రెడ్డి. జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణములో మనం చేసిన అభివృద్ధి మనని గెలిపిస్తుందని అన్నారు. నాయకులు మనం చేపట్టిన రోడ్ల విస్తరణ, పార్కుల సుందరీకరణ,చెరువుల దురస్తూతో ఏర్పాటు చేసుకున్న ట్యాంక్ బండ్లు,జిల్లా కలెక్టరేట్,మాత శిశు సంక్షేమ కేంద్రం,సుందరమైన అంతర్గత సి.సి రోడ్లు,నిత్యం మంచినీటి సరఫరా,టౌన్ హాల్,సమీకృత మార్కెట్,తదితర పనులు ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని పిలుపునిచ్చారు. రెండేండ్లలో పాలన విధ్వంసాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు.మళ్ళీ మనకు అవకాశం పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇవ్వాలని అన్నారు. ఆశావాహులు ఎందరున్నా కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది అని ఐకమత్యంతో పని చేసి మున్సిపల్ ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేసి పార్టీ ప్రతిష్ఠ పెంచాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థులను గెలిపించాలని రావుల చంద్రశేఖరరెడ్డి పిలుపు నిచ్చారు. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరు గ్యారంటీలు,420హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతుందని అన్నారు. నిరంజన్ రెడ్డి హయాములో పట్టణాభివృద్ధి పరుగులు పెట్టిందని మన అభివృద్ధి మనల్ని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ప్రజలలో మంచిపేరు,సేవాభావం కలిగిన అభ్యర్థులను నిర్ణయిద్దామని అన్నారు. అవకాశం రాని నాయకులకు భవిష్యత్తులో పార్టీ గుర్తించి పదవులు ఇస్తుందని ఎవ్వరూ కూడా నిరాశ చెందవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశములో కురుమూర్తి యాదవ్,గంధం.బాలపేరు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : మనం చేసిన అభివృద్ధియే మనకు శ్రీరామ రక్షా)

