ఆలయానికి “అభిషేక పానవట్టం” అందించిన గౌని బ్రదర్స్
న్యూస్తెలుగు/ వనపర్తి : శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామికి వివిధ రకాల ప్రత్యేక అభిషేకాపూజలకు, పడిపూజ మహోత్సవంలో జరుగు అయ్యప్ప స్వామి అభిషేకం చేయుటకు “పావనవట్టం” ను “గౌని బుచ్చారెడ్డి (మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్), గౌని కోదండరామిరెడ్డి (సింగిల్ విండో చైర్మన్) గార్లు ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు…. గౌని బ్రదర్స్ ను వేదమంత్రాలతో ఆశీర్వదించి , ఆలయ కమిటీ సభ్యులు గౌని బ్రదర్స్ ను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి వడ్డే ఈశ్వర్, ఆలయ అన్నదాన కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ , ఆలయ కమిటీ సభ్యులు పున్న శ్రీనివాసులు, వీరబోజాచారి, శ్రీనివాసులు (జానంపేట), హనుమంత్ రెడ్డి, T N.ఎల్లారెడ్డి, తేజేశ్వర్ రెడ్డి, గొడుగు శాంతన్న, వెంకటస్వామి, డాక్టర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. (Story:ఆలయానికి “అభిషేక పానవట్టం” అందించిన గౌని బ్రదర్స్)

