వినుకొండలో పొలం పిలుస్తుంది
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ మండలం ఉప్పరపాలెం, చాట్రగడ్డపాడు గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల వ్యవసాయ అధికారి జీ .వరలక్ష్మి మాట్లాడుతూ. కంది పంట సాగు చేసిన రైతులు పైరుని గమనించి సస్యరక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. క్షేత్ర సందర్శనలో భాగంగా కంది పంటను పరిశీలించి మరూకా మచ్చల పురుగు ఆశించినట్లు గమనించడమైనదని ,నివారణకు 5% వేప గింజల కషాయం లేదా 400 ఎం.ఎల్. వేప నూనె మరియు క్లోరోపైరిపాస్ 400 ఎం.ఎల్ పిచికారి చేయాలని తెలియజేశారు పీ.ఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల్లో పెండింగ్ ఉన్నవారు ఎన్.పి.సి.ఐ.యాక్టివ్ మరియు ఆధార్ యాక్టివ్ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ఆరిప్, విఏయే మౌనిక రైతు సోదరులు పాల్గొన్నారు.(Story:వినుకొండలో పొలం పిలుస్తుంది)

