పదవ తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అసిస్టెంట్ కమిషనర్

న్యూస్ తెలుగు/చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,బాలికల ఆశ్రమ పాఠశాల , ఏపీ ఆర్ ఎస్ ఎర్రంపేట ,మోతుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,డొంకరాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లలో మార్చి 2026 లో 10వ తరగతి పరీక్షలు జరిగే పరీక్ష కేంద్రాలను పాడేరు అసిస్టెంట్ కమిషనర్ శశి కుమార్ సందర్శించి పరీక్షా కేంద్రాల్లో వసతులను పరిశీలించారు, అన్ని పరీక్షా కేంద్రాలలో ఉన్న సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసినారు, పదవ తరగతి బోధించే ఉపాధ్యాయులతో, ప్రధానోపాధ్యాయాలతో సమావేశమై ఈ సంవత్సరం మార్చిలో జరిగే పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాస్ కావడానికి ప్రత్యేక ప్రణాళికల ద్వారా తర్ఫీదునివ్వాలని ఆదేశించి ఉన్నారు,ఈ కార్యక్రమంలో చింతూరు మండల విద్యాశాఖ అధికారి జి వెంకటేశ్వర్లు, కూనవరం మండల విద్యాశాఖ అధికారి టి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. (Story:పదవ తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అసిస్టెంట్ కమిషనర్)

