మృత్యురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం 6 వ వార్డు కి చెందిన సి పి ఎం రాష్ట్ర నాయకులు పుట్ట ఆంజనేయులు గారి భార్య కీ” శే” వరలక్ష్మి గారు ఆకస్మికంగా మరణించడం జరిగింది. ఇట్టి విషయం తెలుసుకొని నేడు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పగడా సానుభూతి తెలియజేశారు ఎంబీబీయస్ సీటు సాధించిన విద్యార్థినిని సన్మానించిన మాజీ మంత్రి వనపర్తి పట్టణం టీచర్స్ కాలనికి చెందిన సుగుర్ సురేందర్ మేస్త్రి మనుమరాలు శ్రీ లక్ష్మి ఎంబిబియస్ సీటు సాధించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి నివాసంలో శాలువాతో సన్మానించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని అభినందించారు.మాజీ మంత్రి గారి వెంట గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్,నందిమల్ల అశోక్, కంచ రవి, సూర్యవంశం గిరి, జోహేబ్ హుస్సేన్, చిట్యాల రాము, రామకృష్ణ, ఆరిఫ్, మంద రాము, అనపటి రాము, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.(Story : మృత్యురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి )

