కరడవలస గ్రామంలో పొలం పిలుస్తుంది
న్యూస్ తెలుగు/సాలూరు : కరడవలస గ్రామములో పొలం బడి కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి శ్రీమతి కె. శిరీష ఆధ్వర్యం లో గ్రామాల్లో పొలం బడి ,పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వరి మరియు మొక్కజొన్న లో యాజమాన్య పద్దతలు తెలియచేసారు, రైతులు యూరియా మోతాదుకు మించి వినియోగించడం వలన పంట పురుగులు మరియు తెగుళ్ల బెడదకు గురి అవుతుంది కనుక తగిన మోతాదులో మాత్రమే యూరియా పంటకు వినియోగించాలని తెలియచేశారు అలానే రైతులందరూ వ్యవసాయ సహాయకులు ని సంప్రదించి ఈ పంట తప్ప కుండా చేసుకోవాలని తెలియచేశారు,మరియు ప్రస్తుత పరిస్థితులలో నానో యూరియా, డి ఎ పి వాడుక ,మరియు కలుగు లాభాలు గూర్చి వివరించడం జరిగింది.ప్రకృతి వ్యవసాయ పద్దతులు చేయడం వలన వివిధ రకాలైన పురుగు,తెగుళ్లు తగ్గి పంట ఆరోగ్యగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు, వ్యవసాయ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు. (Story:కరడవలస గ్రామంలో పొలం పిలుస్తుంది)

