Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినకొండ లో పొలం పిలుస్తుంది

వినకొండ లో పొలం పిలుస్తుంది

0

వినకొండ లో పొలం పిలుస్తుంది

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ నియోజకవర్గం, చీకటి గలపాలెం, శివాపురం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి జి. వరలక్ష్మి మాట్లాడుతూ. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రైతులు పొగాకు పంట సాగు చేయవద్దని ప్రత్యామ్నాయ పంటలైన కంది ,ఆముదం నీటివసతివున్న రైతులు మొక్కజొన్న పంటలు సాగు చేసుకోవాలని అన్నారు. కౌలు రైతులు సీసీఆర్ కార్డులు తీసుకొని పంట నమోదు చేయించుకొనిన యెడల సంబంధిత రైతు సేవా కేంద్ర సిబ్బంది గ్రీవెన్స్ మాడ్యూల్ లో పెట్టి అన్నదాత సుఖీభవ పథకం క్రింద ఆర్హత పొంది, రెండు విడతల్లో 10,000 చొప్పున అనగా అక్టోబర్ మరియు జనవరి నెలలో నిధులు జమ చేయబడునని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తారణాధికారి ఆరిఫ్, చీకటి గలపాలెం గ్రామ రైతుసేవా కేంద్ర సిబ్బంది అపర్ణ, రైతు సోదరులు పాల్గొన్నారు.(Story : వినకొండ లో పొలం పిలుస్తుంది )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version