శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం స్వామివారికి శ్రీకృష్ణ చందన అలంకరణ తో కొలువు తీరాడు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసుల శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవపేతంగా కనుల పండగగా ఆలయ ఆవరణలో ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అధ్యక్షులు రెడ్డి బంగారయ్య సెక్రెటరీ, అచ్యుత కృష్ణ సుబ్బారావు, ట్రెజరర్ శ్రీకాళ్ల రామ కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు అన్న వీరబ్రహ్మ , జీవి మాధవరావు, కొత్త మాస పెదరాములు, ఏల్చూరి వెంకటనారాయణ, భక్తులు పాల్గొన్నారు. (Story:శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు)

