స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాంసాహార దుకాణాలపై నిషేధం..
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈనెల 15వ అనగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వినుకొండ పట్టణం నందు మాంసాహారం నిషేదించడమైనది. జంతువధశాల మూసివేయబడును. కావున మాంసము వ్యాపారస్థులు,చికెన్ స్టాల్స్, మటన్ స్టాల్స్ ,చేపల వ్యాపారస్థులకు తమ దుకాణాలు మూసివేయాలని తెలిపారు. కిచిడి హోటల్స్, రెస్టారెంట్స్ వారు కూడా మాంసాహార విక్రయ నిలిపి వేయవలసినదిగా కోరారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించే వారిపై చట్టరీత్యా తగు కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఒక ప్రకటనలో తెలిపారు. (Story:స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాంసాహార దుకాణాలపై నిషేధం..)

