శాలువాలు, బొకేలు తేవద్దు
సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు
న్యూస్ తెలుగు /వినుకొండ : జులై 14 సోమవారం నా జన్మదినం సందర్భంగా నన్ను కలిసేందుకు వచ్చేవారు శాలువాలు, బొకేలు, గజ మాలలు తేవద్దని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. పుట్టినరోజు సందర్భంగా తన నివాసంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రజలు గమనించి తనను కలిసేందుకు వచ్చేవారు నిండు మనసుతో చాటుకునే అభిమానం తో పుట్టినరోజు శుభాకాంక్షలు చాలునని, శాలువాలు, బొకేలకు పెట్టే ఖర్చుతో పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పర్యావరణాన్ని రక్షించే పూలు, పండ్లు మొక్కలు, అందజేయాలని కోరారు. (Story:శాలువాలు, బొకేలు తేవద్దు)
