బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను పరామర్శించిన మాజీ మంత్రి
న్యూస్తెలుగు/ వనపర్తి : ఖిల్లా ఘనపూర్ మండలం, షాపూర్ ముందరి తండాకు చెందిన,బీ అర్ యస్ కార్యకర్త బద్య నాయక్ అనారోగ్య కారణంగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇట్టి విషయం తెలుసుకొని నేడు ఆసుపత్రికి వెళ్లి కలిసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు కోరారు. మాజీ మంత్రి వెంట మాజీ డిప్యూటీ సర్పంచ్ సొమ్ల నాయక్ తదితరులు ఉన్నారు. (Story:బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను పరామర్శించిన మాజీ మంత్రి)
