బక్రీద్ పండుగ విశ్వాసం,నమ్మకం,పరోపకారానికి, త్యాగనిరతికి ప్రతీక
న్యూస్ తెలుగు/వనపర్తి : మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో ముస్లిం పెద్దలు,పార్టీ మైనార్టీ నాయకులకు,ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తమాకోసమేగాక,తమ పరివరంకోసమేగాక తమ పరిసరాలు తమ చుట్టూ ఉన్న ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని సహాయకారిగా,చేయుతగా ఉండడం,అవసరమైనప్పుడు త్యాగనిరతి ప్రదర్శించడం ఈ బక్రీద్ పండుగ స్పూర్తి అని కొనియాడారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,గంధం.పరంజ్యోతి,నాగన్న యాదవ్,చంద్రశేఖర్,కిషోర్ కుమార్ రెడ్డి,చిట్యాల.రాము, శిరీవాటి.శంకర్,వెంకటయ్య,తోట.శ్రీను తదితరులు ఉన్నారు.(Story : బక్రీద్ పండుగ విశ్వాసం,నమ్మకం,పరోపకారానికి, త్యాగనిరతికి ప్రతీక )