పదవ తరగతి రీ వెరిఫికేషన్ ఫలితాలలో బొత్స సింధు ప్రియా
న్యూస్ తెలుగు/వినుకొండ : పదవ తరగతి రీ వెరిఫికేషన్ ఫలితాలలో గుడ్ షెఫర్డ్ స్కూల్ విద్యార్థిని బొత్స సింధు ప్రియా నమామి 595 మార్కులు సాధించి, నియోజకవర్గంలో ప్రథమ స్థానం సాధించినందుకు స్కూల్ డైరెక్టర్ డాక్టర్ జి ఇన్నారెడ్డి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ ఎన్నారెడ్డి మాట్లాడుతూ. అసాధారణ ప్రతిభ చూపి అత్యధిక మార్కులు సాధించిన బొత్స సింధు ప్రియ నమామి ను ప్రత్యేకంగా అభినందించారు. గడచిన విద్యా సంవత్సరంలో ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యా బోధన చేశారని తెలిపారు. నిర్విరామ కృషి వలన ,కష్టానికి ఫలితం దక్కిందని తెలిపారు. ఈ ఘన విజయం సాధించడానికి ప్రిన్సిపాల్ ,ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని తల్లిదండ్రులు ల ప్రోత్సాహం వలన సాధించగలిగామని తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఒక క్రమ పద్ధతిలో విద్యా తరగతులు ఉండబోతున్నాయని తెలిపారు. చురుకైన తెలివైన విద్యార్థులను వెలికి తీసి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించబోతున్నామని తెలిపారు. వినుకొండ లాంటి వెనుకబడిన ప్రాంతంలో మంచి విద్యను విద్యార్థులకు అందించాలనేదే మా లక్ష్యం అని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జి లక్ష్మీ సునీత మాట్లాడుతూ. మంచి ప్రణాళిక మరియు ఉపాధ్యాయుల నిరంతర కృషి వలన ఈ ఘన విజయం సాధించగలిగామని తెలిపారు. అత్యధిక మార్కులు 595 సాధించామని, పట్టణ పరిధిలో ప్రథమ స్థానంలో నిలిచామని తెలిపారు. బొత్స సింధు ప్రియ నమామి ప్రారంభం నుండి తెలివిగా చురుకుగా ఉండేదని తెలిపారు. ఘన విజయం సాధించిన బొత్స సింధు ప్రియా నామామికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో విద్య తరగతులు నిర్వహించబోతున్నామని తెలిపారు. ముందుగానే చదువులలో చురుకైన విద్యార్థులను గ్రహించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నామని తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరంలో మా పాఠశాలలో నీట్, జేఈఈ కి సంబంధించి ప్రత్యేక తరగతులను కూడా ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. వినుకొండ లాంటి వెనుకబడిన ప్రాంతంలో విద్యార్థిని విద్యార్థులను చదువులలో ఆణిముత్యాలుగా తయారు చేయాలనే దృక్పథంతో పాఠశాల నడుపుతున్నామని తెలిపారు. పాఠశాల డైరెక్టర్లు శ్రీమతి మంజుల రెడ్డి గారు, కిరణ్ రెడ్డి , మదన్ రెడ్డి , సాధించిన బొత్స సింధు ప్రియా నమామి ను ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని తల్లిదండ్రులు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.(Story :పదవ తరగతి రీ వెరిఫికేషన్ ఫలితాలలో బొత్స సింధు ప్రియా )