వినుకొండ ఆర్టీసీ డిపోను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్టీసీ ఈ.డి. నాగేంద్ర ప్రసాద్
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ ఆర్టీసీ డిపోను ఆర్టీసీ ఈ.డి నాగేంద్ర ప్రసాద్ శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ.డి. ఆర్టీసీ బస్టాండ్ కు వచ్చేంతవరకు స్థానిక అధికారులు ఎవరికీ సమాచారం లేదు. దీంతో ఉలిక్కిపడిన స్థానిక ఆర్టీసీ అధికారులు, ఈ.డి. నాగేంద్ర ప్రసాద్ ను తీసుకొని గ్యారేజ్ లోకి వెళ్లారు. ఈ సందర్భంగా ఈ.డి. బస్టాండు, ఆర్టీసీ గ్యారేజీ పలు విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాఫిక్, గ్యారేజ్, మెయింటెనెన్స్, టైర్స్ సెక్షన్, ఎలక్ట్రిషన్ తదితర విభాగాలతో పాటు కార్గో పార్సిల్ కార్యాలయం కూడా తనిఖీ నిర్వహించి నిర్వహణపై ఆరాధిశారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సరైన వేళలకు బస్సులు నడుపుతూ సంస్థకు ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని అధికారులకు సిబ్బందికి సూచించారు. సాయంత్రం వరకు కొనసాగిన ఈ తనిఖీలు నిర్వహించిన నాగేంద్రప్రసాద్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డి.ఎం. జె. నాగేశ్వరరావు, గ్యారేజ్ అధికారులు, ఎస్ టి ఐ లు, ఆర్టీసీ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.(Story : వినుకొండ ఆర్టీసీ డిపోను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్టీసీ ఈ.డి. నాగేంద్ర ప్రసాద్ )