ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి. వెంకటేశ్వర్లు ఆదేశం
న్యూస్తెలుగు/వనపర్తి : ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం గోపాలపేట, ఎదుట్ల గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి ధాన్యం ఎగుమతి, మిల్లుల వద్ద అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రవాణా కాంట్రాక్టర్ను పిలిపించి, లారీల సంఖ్యను పెంచాలని, తద్వారా ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా చూడాలని ఆదేశించారు. (Story:ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి)
