Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఘనంగా శ్రీ లక్ష్మి నరశిమస్వామి జయంతి

ఘనంగా శ్రీ లక్ష్మి నరశిమస్వామి జయంతి

ఘనంగా శ్రీ లక్ష్మి నరశిమస్వామి జయంతి

న్యూస్ తెలుగు/వినుకొండ  : అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు స్వామి జయంతి సందర్భంగా జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో ఆదివారం 108 మంది పొంగళ్ళు 108 పొయ్యిల మీద కుంభ పొంగలి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొని స్వామివారి పల్లకి ఊరేగింపు కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా మక్కెన మాట్లాడుతూ. నిత్య అన్నదానం జరుగుతున్న ఏకైక లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం శ్రీజాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో ఈ దేవస్థానం క్షేత్రంగా అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తుంది. విశ్వమాత గోసంరక్షణ ఆశ్రమ నిర్మాణ రెండవ స్లాబ్ కార్యక్రమానికి కూడా నా చేత కొబ్బరికాయ కొట్టించే అదృష్టాన్ని కలగజేసిన సేవకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మరో ముఖ్య అతిథి స్థానిక న్యాయవాది పొట్లూరి సైదారావు మాట్లాడుతూ. సనాతన పురాతన ధర్మాన్ని ఆచరించే పద్ధతిని గత 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సేవకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 108 పొంగళ్ళు మహిళా భక్తులందరూ ఉత్సవమూర్తితో దేవస్థానం చుట్టు వారు పోసి కొబ్బరికాయలు కొట్టి మూడు ప్రదక్షిణలు మేళతాళాలతో స్వామివారి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామికి కుంభ పొంగలి మహోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించడం మొదటి నుంచి వస్తున్న ఆచారం. ఈ కార్యక్రమంలో జాజుల మాల్యాద్రి, పొట్లూరి సైదారావ, సన్సెట్టి లక్ష్మీనారాయ, జెట్టి శ్రీన, కన్నెగండ్ల అనంత కోటేశ్వరరావ, ఆశ్రమ నిర్మాణ దాతలు ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వాక నిత్య అన్నదాన ఆలయ ప్రధాన సేవకులు జాజులు మాల్యాద్రి భక్త బృందం కార్యక్రమంలో బద్దిక నరసింహారావ, కాకుమాను రామారావ, విశ్వరూప చార, ఏటుకూరు కృష్ణవేణి, భూదేవమ్మా, సరస్వతి, భ్రమరాంబ, నాగలక్ష్మి, మహిళా భక్త బృందం పాల్గొని ప్రారంభించారు.(Story : ఘనంగా శ్రీ లక్ష్మి నరశిమస్వామి జయంతి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!