భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 5వ బొల్లాపల్లి మండల మహాసభ
బొల్లాపల్లి మండలంలోని బండ్లమోటు సీసపు గనిని పునః ప్రారంభించాలి
వరికపూడిసెల ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి ఐదు మండలాల ప్రజలకు సాగు త్రాగునీరు వెంటనే కల్పించాలి
బొల్లాపల్లి మండల ప్రజల దాహార్తిని తీర్చుటకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్
న్యూస్ తెలుగు/వినుకొండ : వరిక పూడిశెల ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి బొల్లాపల్లి మండలంతో సహా నాలుగు మండలాల ప్రజలకు త్రాగునీరు సాగునీరు వెంటనే కల్పించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినుకొండ నియోజకవర్గం లోని బొల్లాపల్లి మండలంలో బొల్లాపల్లి గ్రామ సెంటర్లో జరిగిన సిపిఐ మండల మహాసభ కు మండల కార్యదర్శి పిన్ని బోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించి గత కార్యక్రమాలు వివరించగా సభ ప్రారంభానికి ముందుగా ఎర్రజెండాను సీనియర్ నాయకులు కామ్రేడ్ ఇరగబోయిన కోటేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన మారుతి మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 20న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో భాగంగా మన జిల్లాలో కూడా సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు రైతు వర్గానికి విజ్ఞప్తి చేశారు. వరిక పుడిశల ప్రాజెక్టును తక్షణమే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని నాగార్జునసాగర్ శంకుస్థాపన సమయంలో ఖాళీ చేసిన గ్రామాలకు మరియు ఆ దిగువ మండలాలు వెల్దుర్తి దుర్గి కారంపూడి బొల్లాపల్లి పుల్లలచెరువు మండలాల గ్రామీణ ప్రాంతాలకు సాగు త్రాగునీరు అందించాలని నాగార్జునసాగర్ కుడి కాలువ నీరు ప్రక్కగుండ ప్రవహిస్తున్నప్పటికిని ఆయా ప్రాంతాలలో 1000 అడుగుల బోరు బావులు వేసినప్పటికీ మంచినీరు లేక సాగునీరు లేక ఆయా గ్రామీణ ప్రాంత ప్రజలు, నీరు లేక పశువులు అల్లాడిపోతున్నారని నేటికీ కూడా ట్యాంకర్లతో కొన్ని ప్రాంతాలకు నీరు అందించడం జరుగుతోందని అన్నారు. మండలంలోని గ్రామాల చెరువులను నింపి మంచినీటి కుళాయిల ద్వారా పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని భూములకు సాగునీరు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం, ఇళ్ల స్థలాలు ఇళ్ళు లేని నిరుపేదలకు స్థలం కేటాయించి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆయన కోరారు. అర్హులైన వారందరికీ వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్ వెంటనే మంజూరు చేయాలన్నారు. స్మార్ట్ మీటర్లు ఎత్తివేయాలని పెంచిన కరెంట్ చార్జీలు తగ్గించాలని అధిక ధరలతో సతమతమవుతున్న ప్రజలకు ధరలు తగ్గించి వేసులుబాటు కల్పించాలని, మండలంలో ఎండుమిర్చి పండించిన రైతులకు గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దాపురించాయని దీనిని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తక్షణమే కల్పించుకొని క్వింటా మిర్చికి కనీసం 16,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సైదావలి షేక్ కొండ్రముట్ల చిన్న సుభాని, కొప్పరపు మల్లికార్జునరావు, కండే నాసరయ్య, ఇరగబోయిన కోటేశ్వరరావు తదితరులు పాల్గొని మండలంలోని సమస్యలపై మాట్లాడారు. మహాసభ ఏకగ్రీవంగా ఈ క్రింది తీర్మానాలు ఆమోదించింది.1. మండలంలోని బండ్లమోటు లో ఉన్న సీసపు గనిని పునః ప్రారంభించాలని.2. వరిక పూడిసెల ప్రాజెక్టును తక్షణమే ప్రారంభించి పనులు చేపట్టాలని.3. ఈ ఎండాకాలం మండలంలో త్రాగునీటి ఎద్దడిని యుద్ధ ప్రాతిపదికన ఆదుకొని ప్రజల దాహార్తి తీర్చాలని, 4. త్రాగునీటి సాగునీటి శాశ్వత పథకాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం మహాసభ ఏకగ్రీవంగా 9 మందితో కూడిన నూతన కమిటీని ఎన్నిక చేశారు. మండల కార్యదర్శిగా పిన్నబోయిన వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శులుగా షేక్ సైదా వలి, నక్కా యోహాన్ లను ఆరుగురు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.(Story :భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 5వ బొల్లాపల్లి మండల మహాసభ )