వినుకొండలో “నమస్తే” పథకం కింద వేస్ట్ పిక్కర్స్ ప్రొఫైలింగ్..
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక హనుమాన్ నగర్ సచివాలయం నందు భారత ప్రభుత్వ సామాజిక న్యాయ మరియు సాధికారిక మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక పథకం అయిన “నమస్తే” పథకంలో భాగంగా వినుకొండ పురపాలక సంఘ పరిధిలోని వేస్ట్ పిక్కర్స్ / రాగ్ పిక్కర్స్ యొక్క ప్రొఫైలింగ్ కార్యక్రమం నిర్వహించారు. అసంఘటిత రంగంలో చెత్త సేకరించి జీవనోపాధి పొందుతున్న వారి యొక్క సంక్షేమం కొరకు వారి యొక్క వివరాలను “నమస్తే” యాప్ నందు నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం అందించే వివిధ సౌకర్యాలు మరియు పథకాలు గురించి తెలియజేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో నమస్తే ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్.కె. ఇస్మాయిల్, పల్నాడు జిల్లా దళిత బహుజన రిసోర్స్ పర్సన్ చిన్నప్ప, వాలంటీర్స్, శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, మరియు వేస్ట్ పికర్స్ పాల్గొన్నారు. (Story:వినుకొండలో “నమస్తే” పథకం కింద వేస్ట్ పిక్కర్స్ ప్రొఫైలింగ్..)