నీటిపారుదల రంగం పటిష్టత పై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి
న్యూస్తెలుగు/వనపర్తి : వనపర్తి నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల రంగాన్ని పూర్తిస్థాయిలో పటిష్టపరిచేందుకు రూ. 1323 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపినట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు. గురువారం వనపర్తి జిల్లా నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటుచేసే రిజర్వాయర్లు, కాలువలు, లిఫ్టులతో పాటు అనేక మరమ్మత్తులను దృష్టిలో ఉంచుకొని రూ. 1323 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేశామని ఇందుకు సంబంధించిన నివేదికలను పూర్తిస్థాయిలో తయారు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. గొల్లపల్లి రిజర్వాయర్బు ద్ధారం ఆన్లైన్ రిజర్వాయర్ KLI, D5, D8 కాలువల పటిష్టత, విస్తరణ, స్ట్రక్చర్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూటరీ సిస్టం, బుద్ధారం కుడి, ఎడమ కాలువల పటిష్టత, గణపురం బ్రాంచ్ కెనాల్, కర్నే తండా లిఫ్ట్, కాశింనగర్ లిఫ్ట్ సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలన్నారు
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గ పరిధిలోని పలు చెరువులు కుంటలు చెక్ డ్యాముల నిర్మాణాలు మరమ్మత్తులను వెంటనే చెప్పటాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.కార్యక్రమంలో నీటిపారుదల శాఖ CE సత్యనారాయణ రెడ్డి, SE శ్రీనివాస్ రెడ్డి, DCE వెంకట్ రెడ్డి, EE లు కేశవరావు, జగన్మోహన్ రెడ్డి, DE లు నరేందర్ రెడ్డి, అబ్దుల్ గఫార్, వెంకటరమణదేవి, రాజ్ కుమార్ కిరణ్ కుమార్ ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారురావుల చంద్రశేఖరరెడ్డి వెంట జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షులు పి.రమేష్ గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,ఉంగ్లం. తిరుమల్, సూర్యవంశం గిరి,సునీల్ వాల్మీకి, ఎం.డి.గౌస్, చిట్యాల రాము, నాగేష్, పరుశురాం, బాలరాజు, సూగురు రాము, పోతులపల్లి వెంకటేష్,రామస్వామి,ఖాదర్,తదితరులు పాల్గొన్నారు. (Story:నీటిపారుదల రంగం పటిష్టత పై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి)