భూసార పరీక్షల మట్టి నమూనా సేకరణ
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గం లోని బ్రాహ్మణపల్లి గ్రామ రైతుల పొలాలలో రైతులకు భూసార పరీక్షల మట్టి నమూనా సేకరణ విధానం దాని ఆవశ్యకత గూర్చి పల్నాడు జిల్లా వనరుల కేంద్రం అధికారి ఎం.శివకుమారి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వివరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో వినుకొండ మండల వ్యవసాయాధికారి జీ.వరలక్ష్మి రైతులు తమ పొలాలలో ఎకరంకు 7 నుండి 8 చోట్ల మట్టి నమూనాలు సేకరించి క్వార్టరింగ్ పద్ధతిలో సుమారు 1/2 కేజీ మట్టి వచ్చే వరకు చేసి పాలిథిన్ కవర్లో వేసి రైతు నుండి సర్వేనెంబర్ గతంలో వేసిన పైరు నీటి వసతి ఎరువుల వినియోగం భవిష్యత్తులో వేయవలసిన పైరు మొదలగు వివరములు తెలుసుకొని ఇన్ఫర్మేషన్ షీట్ పూర్తి చేసి మట్టి నమూనా తో పాటు నరసరావుపేటలోని భూసార పరీక్ష కేంద్రం నకు పంపి భూసార పరీక్షా అనంతరం భూసార పరీక్ష ఫలితాల కార్డులు రైతులు అందజేయడం జరుగుతుందని, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకం చేయటం ద్వారా భూమి చౌడువారకుండా చేయవచ్చని పెట్టుబడి తగ్గించుకోవచ్చని రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈఓ సునీత, గ్రామ వ్యవసాయాధికారి భార్గవి, సాయిరాం సింగ్, ఉద్యాన అధికారి రైతులు పాల్గొన్నారు.(Story:పొలాలలో రైతులకు భూసార పరీక్షల మట్టి నమూనా సేకరణ)