Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మల్లం సాంఘిక బహిష్కరణ పై పవన్ కళ్యాణ్ స్పందించాలి

మల్లం సాంఘిక బహిష్కరణ పై పవన్ కళ్యాణ్ స్పందించాలి

మల్లం సాంఘిక బహిష్కరణ పై పవన్ కళ్యాణ్ స్పందించాలి

ఇప్పటికీ కొనసాగుతున్న సాంఘిక బహిష్కరణ

పోలీసుల సాయంతో నిత్యావసర వస్తువుల కొనుగోలు

మృతి చెందిన పల్లపు సురేష్ కుటుంబాన్ని పవన్ పరామర్శించాలీ

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు..

చంద్రన్న బీమా పథకం పల్లపు సురేష్ కుటుంబానికి వర్తింప చేయాలి

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్

పల్లపు సురేష్ కుటుంబాన్ని ఆదుకుంటాం -ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజరు బాబు

న్యూస్ తెలుగు/చింతూరు : కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామంలో ఎస్సీలను సాంఘిక బహిష్కరణ చేసిన ఘటనపై నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని ఈ నెల 16న విద్యుత్ పనుల్లో మరణించిన పల్లపు సురేష్ బాబు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు.సోమవారం ఉదయం 7:00 నుండి 9 గంటల వరకు సిపిఐ, ఏఐటియుసి, దళిత హక్కుల సమితి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సమైక్య తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మల్లం గ్రామం లో పర్యటించి జరిగిన సంఘటన తెలుసుకొని బాధి కుటుంబాన్ని పరామర్శించారు.అక్కడ రెండు రోజులు పాటు జరుగుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. సురేష్ బాబు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ మల్లం గ్రామానికి చెందిన ఒక అగ్రకులం వారి ఇంట్లో పల్లపు సురేష్ బాబు విద్యుత్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది. దానిపై ఇది వర్గాల పెద్దలు కూర్చుని కుటుంబానికి రెండు లక్షల 75000 సహాయం చేయాలని నిర్ణయించడం జరిగింది.మమ్మలనే నష్టపరిహారం అడిగారనే ధోరణిలో అగ్రకులాల పెద్దలందరూ దళిత కుటుంబాలందరినీ సాంఘిక బహిష్కరించాలనేది నిర్ణయించుకుని గ్రామంలో ఉన్న దళితులకు పాలు తాగే చంటి పిల్లల సైతం పాలు ఇవ్వద్దని, టిఫిన్ సెంటర్ టిఫిన్లు వారికి అమ్మకూడదని, కిరణా వ్యాపారుల కిరాణా ఇవ్వకూడదని, చివరకు బయట నుండి వచ్చే చేపల గంపల్ని కూడా వెనక పంపడం జరిగిందని ఇది అవమానియా ఘటనని మధు అన్నారు. దీనిపై నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి కుటుంబానికి న్యాయం చేయాలని, అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి సాంఘిక బహిష్కరణ ఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత ఆయనకే ఉందని మధు అన్నారు. ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులపై చర్యలు తీసుకోవాలని మధు అన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సును అమలు చేయాలని ఆయన కోరారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘాలుగా ఎన్నో ఆందోళన చేస్తున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పథకాల అమలు జరిగి ఉండుంటే ఈరోజు పల్లపు సురేష్ భవన నిర్మాణ కార్మికుడు ఎలక్ట్రిషన్కు 5 లక్షల ఆర్థిక సహాయం అందేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చంద్రన్న బీమా పథకం ద్వారా సురేష్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రసాదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు మాట్లాడుతూ పల్లపు సురేష్ బాబు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ప్రభుత్వం దృష్టికి పల్లపు సురేష్ మృతి విషయాన్ని తెలియజేస్తామని ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయం అందించేందుకు నా వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరపు అప్పలరాజు,దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి శాఖ రామకృష్ణ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నక్క శ్రీనివాసరావు, మహిళా సమైక్య తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పి లావణ్య, కాకినాడ జిల్లా కన్వీనర్ భవాని, ఎస్సీ సంఘాలు, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.(Story : మల్లం సాంఘిక బహిష్కరణ పై పవన్ కళ్యాణ్ స్పందించాలి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!