పేద బ్రాహ్మణులకు 99వ నిత్యావసర వితరణ
న్యూస్ తెలుగు/వినుకొండ : బ్రాహ్మణ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు జీవి మాధవరావు ఆధ్వర్యంలో విద్యానగర్ 4 వ లైన్ నందు చింతలచెర్వు రఘు ఇంటి వద్ద4 కుటుంబాలకు బియ్యం,నూతన వస్త్రాలు బహుకరణ జరిగింది. ప్రతి నెల దాత చింతలచెర్వు రాఘవేంద్ర రావు, ఉల్లగంటి బాల గురునాధం , నందిగామ పవన్ కుమార్, గాయత్రీ చింతలపూడి కృష్ణ మోహన్ సహాయ సహకారాలతో 4 కుటుంబాలకు సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం.వి శర్మ, భువనగిరి సుబ్రహ్మణ్యం, ధారా రామమూర్తి , ధూళిపాళ్ళ వెంకటేశ్వర్లు,దిట్ట కవి శ్రీనివాసా చార్యులు, ధూళిపాళ్ళ నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.(Story : పేద బ్రాహ్మణులకు 99వ నిత్యావసర వితరణ)