Homeవార్తలుతెలంగాణస్వాతంత్రం సమర యోధుడు స్వర్గీయ బాపూజికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

స్వాతంత్రం సమర యోధుడు స్వర్గీయ బాపూజికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

స్వాతంత్రం సమర యోధుడు స్వర్గీయ బాపూజికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

న్యూస్‌తెలుగు/వనపర్తి : భారతదేశ స్వాతంత్రం కోసం శాంతియుతంగా ఎన్నో సత్యాగ్రహాలు, పోరాటాలు చేసి స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టిన పూజ్య బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ఉదయం ఐ.డి.ఒ.సి సమావేశ మందిరంలో జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు తో కలిసి మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూల మాలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలక్టర్ మాట్లాడుతూ బాపూజీ కుష్టు వ్యాధి గ్రస్తుల పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయత చూపించే వారని, కుష్టు వ్యాధి ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది కానీ ఇది ఒకరి నుండి ఒకరికి సంక్రమించదని వారి పట్ల సమాజంలో ప్రేమ అభిమానం చూపించాలని బాపూజీ ప్రచారం చేసి వారికి ఆశ్రయం కల్పించారన్నారు. అందుకే మహాత్మా గాంధీ వర్ధంతి రోజున జాతీయ కుష్టు వ్యాధి నివారణ దినోత్సవంగా సైతం పాటిస్తామని తెలియజేశారు. కుష్టు వ్యాధి గ్రస్తులకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన పౌష్టికాహార ధాన్యం కోట్లను కలెక్టర పంపిణీ చేశారు. ఐ.డి. ఒ. సి లోని సిబ్బంది అందరితో కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం పై ప్రతిజ్ఞ చేయించారు నా కుటుంబంలో లేదా పొరుగువారిలో వారిలో లేదా సమాజంలో ఎవరికైనా చర్మంపై స్పర్శ కోల్పోయిన మచ్చలు ఉండి, వాటిని తాకినప్పుడు లేదా వాటిపై నొప్పి కలిగించనప్పుడు తెలియక పోయినట్లైతే, లేదా కుష్టువ్యాధి కారణంగా కనిపించే అంగవైకల్యము ఏర్పడిన వారి పట్ల శ్రద్ధ వహిస్తానని మరియు వారి -నివాసానికి సమీపంలో ఉన్న ఏదైన ప్రభుత్వ సంస్థ నుండి పూర్తి చికిత్స తీసుకొనేలా సూచనలిస్తానని మహాత్మాగాంధీ గారి వర్ధంతి రోజు కార్యక్రమంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాసొంత కుటుంబం సభ్యుల లాగా భావించి, వారికి నేను ప్రేమతో చికిత్స చేస్తానని మరియు ఏ విధమైన వివక్షత చూపకుండా వారి ఆత్మ గౌరవాన్ని పరిరక్షించేలా శ్రద్ధతో చికిత్స అందిస్తాను. కుష్టువ్యాధి పూర్తిగా నయమవుతుంది. సత్వర చికిత్స వలన అంగవైకల్యాలను నివారించవచ్చు. మరియు కుష్టువ్యాధి సోకిన వ్యక్తులపై వివక్షత చూపరాదు. కుష్టువ్యాధికి సంబంధించిన ఇలాంటి సందేశాలను సమాజంలో వ్యాప్తి చేస్తాను. మహాత్మగాంధీ కలలు కన్న విధంగా, సమీప భవిష్యత్తులో కుష్టువ్యాధి రహిత భారతదేశ నిర్మాణములో అందరితో కలిసి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానని ప్రతిజ్ఞ చేయించారు.
జిల్లా అధికారులు, కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story : స్వాతంత్రం సమర యోధుడు స్వర్గీయ బాపూజికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics