Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌త‌ల్లిదండ్రుల‌ను విస్మ‌రించ‌రాదు

త‌ల్లిదండ్రుల‌ను విస్మ‌రించ‌రాదు

త‌ల్లిదండ్రుల‌ను విస్మ‌రించ‌రాదు

న్యూస్ తెలుగు/వినుకొండ  : కన్న తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని వారి ద్వారానే మనం ఈ భూమి మీదకు వచ్చామన్న సంగతి మర్చిపోవద్దని వారిని విస్మరించరాదని ప్రభుత్వ చీప్ ఇఫ్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. గుమ్మడి వృద్ధాశ్రమం, గుమ్మడి కళా పీఠం ఆధ్వర్యంలో సినీ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు, వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి జరిగిన “మాతృదేవోభవ” “పితృదేవోభవ” సభా కార్యక్రమంలో జీవి ఆంజనేయులు పాల్గొని ప్రసంగించారు. మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు మాట్లాడుతూ. మన వినుకొండ గుమ్మడి నిజమైన అవార్డులు అందజేస్తూ అనాధ వృద్ధులను మాత్రమే ఆశ్రమంలో చేర్చుకొని గుమ్మడి శ్రీమతి వెంకటలక్ష్మి వృద్ధులకు సేవలను అందిస్తున్నారని, సంఖ్యా బలంతో సంబంధం లేకుండా పది మంది అనాధ వృద్ధులను ఆదరిస్తున్నారని, ఆశ్రమంలో చనిపోయిన వారికి వారే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని, నేను కూడా వెళ్లి వాళ్ళ యోగక్షేమాలు విచారిస్తూ ఉన్నానని తెలిపారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ. నవ మాసాలు మోసి పురిటి నొప్పులు భరించి, తన ప్రాణాలను ఫణంగా పెట్టి మనకు జన్మనిచ్చింది తల్లి. మనల్ని మనిషిగా తీర్చి దిద్దేది తండ్రి అటువంటివారిని, వారు వయస్సు మళ్ళిన తర్వాత చూడకుండా ఉండటం దారుణమన్నారు. గుమ్మడి తన వృద్ధాశ్రమంలో భర్త, పిల్లలు, ఆస్తి లేకుండా, చూసే వారు లేని వారిని మాత్రమే చేర్చుకుంటున్నాడని అన్నారు. విలువలు కలిగిన వ్యక్తి గుమ్మడి అని కొనియాడారు. గుంటూరు నుండి ఈ కార్యక్రమానికి వినుకొండ వచ్చానంటే గుమ్మడి వృద్ధులకు చేస్తున్న నిస్వార్ధ సేవలు నన్ను ఇక్కడికి రప్పించాయని అన్నారు. ఇఫ్తా జాతీయ కార్యదర్శి గని వృద్ధుల గురించి మానవ సంబంధాల గురించి పాడిన పాటలు ప్రేక్షకులను అలరింప చేశాయని, పద్య పోటీలు కేవలం అమ్మానాన్న పాటలతో ఆర్కెస్ట్రా పలువురిని ఆకర్షించాయి. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు, మక్కెన, ముప్పాళ్ళ నాగేశ్వరరావు గుమ్మడి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అతిధులను వారి అమ్మానాన్నలను ఫోటోలు ను బహుకరించారు. గుమ్మడి కళా పీఠం వారు చీఫ్ ఈఫ్ గా నియమతులైన సందర్భంగా జీవి ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సండ్రపాటి సైదా, పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి ఏ.మారుతి వరప్రసాద్, లాయర్లు సిద్దయ్య, సైదారావు, ఏజీపీ జ్ఞానేశ్వర్ రావు, నల్లబోతుల రామకోటేశ్వరరావు, పి.వి.సురేష్, ఆయబుఖాన్, సద్దాం, తదితరులు పాల్గొన్నారు.*(Story : త‌ల్లిదండ్రుల‌ను విస్మ‌రించ‌రాదు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics