Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా ప్రభుత్వన్యాయవాదులు పనిచేయాలి

ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా ప్రభుత్వన్యాయవాదులు పనిచేయాలి

ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా ప్రభుత్వన్యాయవాదులు పనిచేయాలి

ఏజీపీ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడికి జీవీ అభినందనలు

న్యూస్ తెలుగు/వినుకొండ  : అభివృద్ధి, అధికారిక కార్యకలాపాలకు న్యాయపరమైన అడ్డంకులు తలెత్తకుండా, ఎదురైన సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వ న్యాయవాదులు కీలకపాత్ర పోషించాలని ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వారు ఆ బాధ్యతను ఎంత సమర్థంగా నిర్వహిస్తే అంతవేగంగా ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరడానికి వీలు కలుగుతుందని అ‌న్నారు. దీన్ని కేవలం ఒక ఉద్యోగంగా కాకుండా బాధ్యతగా తీసుకుంటే పరోక్షంగా ప్రజలకు ఎంతో సేవ చేసిన వారు అవుతారని సూచించారు. వినుకొండ జూనియర్ సివిల్ కోర్టులో అదనపు ప్రభుత్వ న్యాయవాది(ఏజీపీ)గా నియమితులైన ముప్పాళ్ల జ్ఞానేశ్వరావు, వినుకొండ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమితులైన నక్కా రమణారావు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జ్ఞానేశ్వరరావు, రమణారావును శాలువాలతో సత్కరించి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరు జీవీ ఆంజనేయులుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(Story : ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా ప్రభుత్వన్యాయవాదులు పనిచేయాలి )
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics