అవినీతిపరులకు ఘనంగా వీడుకోలు పలుకుదాం
న్యూస్తెలుగు/ వనపర్తి : అవినీతిపరులకు ఘనంగా వీడుకోలు పలుకుదాం, మంచివారిని గుండెల్లో పెట్టుకుందాం, అని బల్దియా పాలకులపై ప్రజలకు అఖిలపక్ష ఐక్యవేదిక పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ గత నాలుగు సంవత్సరాల క్రితం 67 లక్షలు పైగా ఖర్చు చేసి తెచ్చిన సెకండ్ హ్యాండ్ స్వీపింగ్ మిషన్ ఒక్కరోజు కూడా పనిచేయకుండా మూలకు పెట్టడంతో దానికి పూజ చేసి ఐక్యవేదిక నాయకులు నివాళులు అర్పించారు. నాలుగు సంవత్సరాల క్రితం ప్రజల సొమ్ముతో పనికిరాని స్వీపింగ్ మిషను తెచ్చి (ఘాట్లో) మూలకు పెట్టేశారు. అంతేకాకుండా పాత జె.సి.బి ని, ట్రాక్టర్లను, ఇతర పాత సామాన్లు ఎలాంటి టెండర్ లేకుండా రాత్రికి రాత్రి అమ్ముకున్నారు. మొత్తం కలిపితే కోట్లల్లో అవుతుంది. అవన్నీ ప్రజల డబ్బు. ఇంత అవినీతి జరుగుతున్నా ,చూచి చూడనట్లుంటున్న అధికారులు వారికి ఎంత శాతం మడుతుందో తెలియాలి. లేకుంటే చర్యలు తీసుకోవాలి. వీటిపై విచారణ జరిపించాలని ఐక్యవేదిక కోరుతున్నా పట్టించుకోలేదు అని తెలిపారు. అధినాయకులు, అధికారులు.. ప్రజలకు మాత్రం చెత్తకు టాక్స్,నీటికి టాక్స్, ఇంటికి టాక్స్ ,అంటూ కడుతూ పోతున్నారు పాలకులు ప్రజల కష్టాలను మాత్రం విస్మరిస్తున్నారు. ఐదు సంవత్సరాలలో ఎవరు మంచివారు, ఎవరు అవినీతిపరులో తేల్చి చెప్పడానికి ఐక్యవేదిక సిద్ధమై ప్రజల ముందుకు వస్తున్నది. త్వరలో కొందరి అవినీతి,అన్ని వార్డుల వారీగా సమస్యలు, అభివృద్ధి ప్రజల ముందు ఉంచుతాముఅని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తోపాటు టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్, బీఎస్పీ టౌన్ అధ్యక్షులు గంధం భరత్, నాయకులు బొడ్డుపల్లి శంకర్, బీసీ నాయకులు గౌనీకాడి యాదయ్య, లోక్సత్తా నాయకులు రాజ్ కుమార్, బిజెపి నాయకులు రవి, శివకుమార్, రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారుఅవినీతిపరులకు ఘనంగా వీడుకోలు పలుకుదాం. (Story : అవినీతిపరులకు ఘనంగా వీడుకోలు పలుకుదాం)