Home ఒపీనియన్‌ ఫారెస్ట్ అధికారుల అసమర్థత వల్లే దాడులు

ఫారెస్ట్ అధికారుల అసమర్థత వల్లే దాడులు

0

ఫారెస్ట్ అధికారుల అసమర్థత వల్లే దాడులు

సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

న్యూస్ తెలుగు /కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో పత్రికా విలేకర్ల సమావేశంలో సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులు ఎంతసేపూ అక్రమ సంపాదన మీద దృష్టి పెట్టారని, అందుకే అటవీ సంరక్షణ, పులుల సంరక్షణ మీద దృష్టి పెట్టలేకపోతున్నారని విమర్శించారు. ఎంతసేపూ ఫారెస్ట్ కేసులు పెట్టి డబ్బులు గుంజుదామనే యావలో ఉన్న ఫారెస్ట్ అధికారులు వెంటనే జిల్లాను వదిలి వెళ్తే ఈ జిల్లా బాగుపడుతుందని సూచించారు.
పులుల దాడుల్లో మనుషులు, మనుషుల వలన పులులు చనిపోవడం అంటే ఇది పూర్తిగా ఫారెస్ట్ అధికారుల అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు.
గత రెండేళ్లలో పులి నలుగురిని పొట్టన పెట్టుకుందని, అలాగే ఏనుగు దాడిలో ఇద్దరు చనిపోయారని,వారికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇంకా అందలేదని అన్నారు.కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మీ కుటుంబానికి ఇంకో పది లక్షలు చెల్లించాలని, అలాగే ఐదు ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు.పులులకు రేడియో కాలరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే పులులను ట్రాక్ చేయడం సులభతరం అవుతుందని, మహారాష్ట్ర విధానాన్ని అనుసరించాలని సూచించారు.రాబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో ఈ విషయాలన్నీ లేవనెత్తుతామని అన్నారు. (Story : ఫారెస్ట్ అధికారుల అసమర్థత వల్లే దాడులు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version