Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవనం ప్రారంభం

గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవనం ప్రారంభం

0

గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవనం ప్రారంభం

న్యూస్ తెలుగు సాలురు : పాచిపెంటలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను 1 కోటి 75 లక్షలతో నిర్మించిన అదనపు వసతి భవనాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విద్యార్దులకు మెస్ చార్జీలు పెంచి మెరుగైన ఆహారం అందిస్తాం మంత్రి సంధ్యారాణి శుక్రవారం పాచిపెంట గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ బాలిక హాస్టల్ బాలిక అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్బులు, షాంపులు తదితర కాస్మొటిక్ చార్జీలు ఇకపై విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. విద్యార్దులు తెలిపిన అదనపు సమస్యలను నెరవేర్చుతామని హామీ ఇచ్చారు.చదువులతో పాటు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, అన్నారు. ఆటలు కూడా ఆడాలని సూచించారు ప్రహరీ, అదనపు మరుగుదొడ్లు, ఆటస్థలం త్వరలోనే నెరవేర్చుతామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాచిపెంట మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పిన్నింటి ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాంచాలి సర్పంచ్ గూడెపు యుగంధర్ పాచిపెంట ఎంపీటీసీ పల్లెటూరు వెంకటరమణ ముఖి సూర్యనారాయణ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు.(Story : గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవనం ప్రారంభం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version